BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి: గుడుంబా తయారీ సామగ్రి పట్టివేత.. ఒకరి అరెస్ట్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:14 AM
20 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి: గుడుంబా తయారీ సామగ్రి పట్టివేత.. ఒకరి అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గుడుంబా తయారీకి ఉపయోగించే సామగ్రి పట్టుబడింది. బొలెరో వాహనంలో తరలిస్తున్న 2,250 కిలోల నల్ల బెల్లం, 20 కిలోల పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ బాలానగర్‌కు చెందిన కెంపే శివానందను అదుపులోకి తీసుకున్నారు. వాహనం, నల్ల బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి విలువ సుమారు రూ.2.27 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. గుడుంబా తయారీ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.