మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి: గుడుంబా తయారీ సామగ్రి పట్టివేత.. ఒకరి అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి: గుడుంబా తయారీ సామగ్రి పట్టివేత.. ఒకరి అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ క్రాస్రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గుడుంబా తయారీకి ఉపయోగించే సామగ్రి పట్టుబడింది. బొలెరో వాహనంలో తరలిస్తున్న 2,250 కిలోల నల్ల బెల్లం, 20 కిలోల పట్టికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ బాలానగర్కు చెందిన కెంపే శివానందను అదుపులోకి తీసుకున్నారు. వాహనం, నల్ల బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి విలువ సుమారు రూ.2.27 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. గుడుంబా తయారీ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.