BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

గణిత–విజ్ఞాన మేళాలో విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
22 Aug, 2026 - 01:58 PM
136 వీక్షణలు

గణిత–విజ్ఞాన మేళాలో విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల | NTODAY News 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత–విజ్ఞాన మేళా కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులను ఆమె ప్రారంభించి పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, నూతన ఆవిష్కరణలను అభినందించి ప్రోత్సహించారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి విజ్ఞాన మేళాలు ఎంతగానో దోహదపడతాయని సురేఖ పేర్కొన్నారు. చదువుతో పాటు పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని అలవర్చుకుని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కొక్కిరాల సురేఖను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు షేర్ శ్రీలక్ష్మి–పవన్, సుద్దమల్ల హరికృష్ణ, చిలువేరి జ్యోతి–శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.