www.ntodaynews.com
భార్యను సుత్తితో కొట్టి హత్య చేసిన భర్త
తెలంగాణ
/
మంచిర్యాల
/
చెన్నూర్
మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నూర్ మండలంలోని ఎల్లక్కపేటలో భర్త తన భార్యను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది