BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

​ఎన్నికల విధుల బకాయిలు వెంటనే చెల్లించాలి – అదనపు కలెక్టర్‌కు ఫోటోగ్రాఫర్ల వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
08 Jun, 2026 - 06:13 PM
9 వీక్షణలు

ఎన్నికల సమయంలో విధులు నిర్వహించిన తమకు రావలసిన పెండింగ్ డబ్బులను వెంటనే ఇప్పించాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫోటోగ్రాఫర్లు వినతిపత్రం సమర్పించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఫోటో, వీడియో గ్రాఫర్లకు సంబంధించి సుమారు రూ. 4 లక్షల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తమకు పైసలు చెల్లించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారులు స్పందించి తమ ఆర్థిక పరిస్థితిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదలయ్యేలా చూడాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జక్కుల రాజు, కుమార్ తదితరులు ఉన్నారు.