మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్లో ముమ్మరంగా ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక
అవగాహన సదస్సు నిర్వహించిన కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ, 3 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్థానిక కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ అధ్యక్షతన, వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ ప్రజలకు పలు కీలక సామాజిక, ఆరోగ్య అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఘన పదార్ధ వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం, మరియు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సమాజంలో పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్, గంజాయి మహమ్మారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, రోడ్ సేఫ్టీ నియమాలను పాటించాలని ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం సందర్భంగా డివిజన్ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. అలాగే డివిజన్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన మూడు కొత్త ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. ఈ ప్రగతి ప్రణాళికా సదస్సులో మంచిర్యాల సీఐ ప్రమోద్ రావు, విద్యుత్ శాఖ డీఈ వేణుగోపాల్, ఏఈ శ్రీనివాస్, వార్డ్ అధ్యక్షురాలు సరిత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆర్పీలు కృష్ణవేణి, షరీఫా, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు