BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 01:55 PM
63 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ స్లీపర్ డాగ్ సహాయంతో రైల్వే బోగీలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు.

పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్, డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వస్తువుల కోసం శిక్షణ పొందిన నార్కోటిక్ స్లీపర్ డాగ్‌ను వినియోగించారు.

ఈ సందర్భంగా సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేసి, ప్రయాణికులకు సురక్షిత వాతావరణం కల్పించడం తమ ప్రధాన బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ తనిఖీలలో సీఐ ప్రమోద్ రావుతో పాటు ఎస్సై మధుసూదన్, నార్కోటిక్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎటువంటి గంజాయి స్వాధీనం కాలేదని, అయితే అప్రమత్తత కోసం తనిఖీలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు