BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 01:55 PM
104 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ స్లీపర్ డాగ్ సహాయంతో రైల్వే బోగీలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు.

పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్, డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమానాస్పద వస్తువుల కోసం శిక్షణ పొందిన నార్కోటిక్ స్లీపర్ డాగ్‌ను వినియోగించారు.

ఈ సందర్భంగా సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత పటిష్టం చేసి, ప్రయాణికులకు సురక్షిత వాతావరణం కల్పించడం తమ ప్రధాన బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఈ తనిఖీలలో సీఐ ప్రమోద్ రావుతో పాటు ఎస్సై మధుసూదన్, నార్కోటిక్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎటువంటి గంజాయి స్వాధీనం కాలేదని, అయితే అప్రమత్తత కోసం తనిఖీలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు