ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు ఏర్పాట్ల పరిశీలన — జిల్లా కలెక్టర్, ఎస్పీ సమీక్ష
ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, గిద్దలూరు ఎమ్మెల్యే మరియు జిల్లా అధికారులు ముందస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
హెలిప్యాడ్ స్థలం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలు తదితర ప్రాంతాలను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ సభా ప్రాంగణం, వేదిక ఏర్పాటు, వీఐపీ వాహనాల రాకపోకలు, సీఎం ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాలు, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ను సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.