BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:38 AM
34 వీక్షణలు

మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో ఉత్పాదక సమావేశం జరిగిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి హోదాలో తన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంపిక చేసినందుకు గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

బుద్ధ భగవానుని ఆశీర్వాదంతో బోధ్ గయ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. భారత్-మయన్మార్ సంబంధాల పూర్తి స్థాయిని సమీక్షించినట్లు వెల్లడించారు.

భారత్‌ ‘నైబర్‌హుడ్ ఫస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’, ఇండో-పసిఫిక్ విధానాలకు మయన్మార్ అత్యంత ముఖ్యమైన దేశమని మోదీ అన్నారు. వాణిజ్యం, అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్స్), ఆరోగ్య సంరక్షణ, అనుసంధాన మౌలిక సదుపాయాలు, వారసత్వ పునరుద్ధరణ, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

అదేవిధంగా సముద్ర భద్రత, సైబర్ భద్రతతో పాటు ఇతర వ్యూహాత్మక రంగాల్లోనూ ఇరు దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేయడానికి అంగీకరించినట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు.