మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ హ్లైంగ్తో ఉత్పాదక సమావేశం జరిగిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి హోదాలో తన తొలి విదేశీ పర్యటనకు భారత్ను ఎంపిక చేసినందుకు గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
బుద్ధ భగవానుని ఆశీర్వాదంతో బోధ్ గయ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. భారత్-మయన్మార్ సంబంధాల పూర్తి స్థాయిని సమీక్షించినట్లు వెల్లడించారు.
భారత్ ‘నైబర్హుడ్ ఫస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’, ఇండో-పసిఫిక్ విధానాలకు మయన్మార్ అత్యంత ముఖ్యమైన దేశమని మోదీ అన్నారు. వాణిజ్యం, అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్స్), ఆరోగ్య సంరక్షణ, అనుసంధాన మౌలిక సదుపాయాలు, వారసత్వ పునరుద్ధరణ, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
అదేవిధంగా సముద్ర భద్రత, సైబర్ భద్రతతో పాటు ఇతర వ్యూహాత్మక రంగాల్లోనూ ఇరు దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేయడానికి అంగీకరించినట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు.