BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ధర్మపురిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

తెలంగాణ
30 Dec, 2025 - 11:07 AM
161 వీక్షణలు

ధర్మపురిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్షణ్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న కొప్పుల ఈశ్వర్ దంపతులు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తజన సంద్రమైంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణి స్నేహలతతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనం – ప్రత్యేక పూజలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని ఉత్తర ద్వారం గుండా లక్ష్మీనరసింహ స్వామిని కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. పాల్గొన్న ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ దంపతులతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత – సురేష్ దంపతులు, మాజీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ లోక బాపు రెడ్డి, మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ హరిచరణ్ రావు, ధర్మపురి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ సంగి సత్తెమ్మ, ఇందారపు రామన్న, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు అయ్యోరి రాజేష్, కృష్ణ రెడ్డి, శీలం ప్రవీణ్, నాగేశ్వర్ రావు బీఆర్‌ఎస్ నాయకులు బుర్ర ప్రవీణ్ గౌడ్, తుమ్మ గంగాధర్, మహేందర్ రెడ్డి, రంజిత్, చిట్ల రమణ, మల్లేశం, శేఖర్, మహేష్, శ్యామ్, విజయతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube