www.ntodaynews.com
నేర నియంత్రణకు ప్రజలు సహకరించాలి: మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
సమాజంలో నేరాల నియంత్రణకు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు 38వ డివిజన్లో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా నేటి యువత సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
అనంతరం కార్పొరేటర్ పూదరి విజయరాణి మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రజల సమస్యలు అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు