www.ntodaynews.com
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 17వ రోజు పెరుగన్నం పంపిణీ
మంచిర్యాల పట్టణంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ నాయకులు, మాజీ సర్పంచ్ బేర పోచయ్య ఆధ్వర్యంలో పెరుగన్నం పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దొమ్మటి అర్జున్, అత్తే తిరుపతి, దొమ్మటి వెంకన్న, ముడిమడుగుల సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే 47వ డివిజన్ నాయకులు, నాయకురాలు ఎం.డి. ఖలీల్, కంఠం రాజమణి, మాడుగుల శ్రీనివాస్, చిర్ర గౌరీ ప్రియ, ఎం.డి. షఫీ, ఆవునూరు సుధా పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు పద్మ, నక్క తిరుపతి, జావీద్, వేణుగోపాల్, జక్కం జగన్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.