BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

నూజివీడులో మద్యం అమ్మకాలకు ఊపు.. జూలైలో 22 శాతం వృద్ధి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 07:19 PM
19 వీక్షణలు

నూజివీడులో మద్యం అమ్మకాలకు ఊపు.. జూలైలో 22 శాతం వృద్ధి

"నవోదయం–2.0" ప్రభావంతో అక్రమ నాటుసారాకు అడ్డుకట్ట.. పెరిగిన అధికారిక విక్రయాలు

నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2026 జూలై నెలలో మద్యం అమ్మకాలు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే గణనీయంగా పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2025 జూలైలో ₹13.63 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదుకాగా, 2026 జూలైలో అవి ₹16.57 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ₹2.94 కోట్ల అదనపు విక్రయాలు నమోదై, గత ఏడాదితో పోల్చితే సుమారు 22 శాతం వృద్ధి నమోదైంది.

అలాగే, 2024 జూలైలో కేవలం ₹9.76 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదుకాగా, 2026 జూలై నాటికి అవి ₹16.57 కోట్లకు చేరడం ద్వారా 69.77 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న "నవోదయం–2.0" కార్యక్రమం కింద నాటుసారా తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలింపు, విక్రయాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ నిరంతర ప్రత్యేక దాడులు, కట్టుదిట్టమైన నిఘా చేపట్టింది. ఈ చర్యలతో అక్రమ మద్యం లభ్యత గణనీయంగా తగ్గి, అధికారిక మద్యం విక్రయాలు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ గణాంకాలు "నవోదయం–2.0" కార్యక్రమం అక్రమ నాటుసారా నిర్మూలనలో సాధిస్తున్న ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య మొబైల్ నంబర్ 9440902462కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.