BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

​నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jul, 2026 - 04:30 PM
202 వీక్షణలు

​​నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

నస్పూర్ (మంచిర్యాల): ఎస్‌బీఐ (SBI) తరహాలోనే యూనియన్ బ్యాంకులో ఖాతాలున్న సింగరేణి కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ.50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 70 ఏళ్లలోపు ఖాతాదారులకు బీమా వర్తింపుపై ఒప్పంద పత్రాలలో స్పష్టత లేదని నాయకులు పేర్కొన్నారు. దీనిపై పత్రికలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పెన్షనర్లకు పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ బ్రాంచ్ మేనేజర్ బోగే సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

​ఈ నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కోశాధికారి బింగి రాజేశం, కార్యదర్శి ఎన్నం శంకర్, ఆర్గనైజర్ తణుకుల మోహన్, జిల్లా ఏరియా నాయకులు సంగెం రాంచందర్, మేడ రాజలింగు, టీ.శ్రీహరి, ఎన్.సదాశివ, ఎండి.ఖాదర్, హుస్సేన్, ఇ.రాజనర్సు, రేకుల పర్వతాలు, బి.ఒదయ్య, ఎస్డీ.అబ్బాస్ అలీ, బాజీ రెడ్డి సురేష్, అర్వ మల్లయ్య, ఇరుకుల జనార్దన్, పి.లక్ష్మయ్య, కె.పోచయ్య, ఎస్.బాణయ్య, కె.దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు