BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 05:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అరుదైన గుర్తింపు.. రూ.1,276 కోట్ల వార్షిక ఆదాయం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
04 Sep, 2026 - 05:45 PM
8 వీక్షణలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోని అత్యధిక ఆదాయం, అత్యంత రద్దీ కలిగిన రైల్వే స్టేషన్లలో టాప్-4లో నిలిచినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.78 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, స్టేషన్‌కు రూ.1,276.29 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలను అనుసంధానించే కీలక రైల్వే కేంద్రంగా సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారీ సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ఆధునీకరణ పనులు చేపడుతున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించేందుకు సుమారు రూ.714 కోట్ల అంచనా వ్యయంతో పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతులు, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఆధునీకరణ పనులు పూర్తయిన అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.