వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు.
దేవరుప్పుల, రాయపర్తి, తొర్రూరు మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారులపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
కార్యకర్తలతో కలిసి రోడ్డుపైనే భోజనం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.