అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం
ఎన్ టుడే న్యూస్, ఘట్కేసర్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. యంనంపేట శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మహిళ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన వెదజల్లుతుండగా గమనించిన యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండొచ్చని, వారం రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మహిళ హత్యకు గురైందా ? లేక ఇతర కారణాలతో మృతి చెందిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.