BREAKING
గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్
www.ntodaynews.com

ఒకేసారి మూడు నెలల రేషన్‌.. లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 06:46 AM
25 వీక్షణలు

ఒకేసారి మూడు నెలల రేషన్‌.. లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

తెలంగాణలో రేషన్‌ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మార్గం సుగమమైంది.

మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేషన్‌ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బియ్యం సరఫరాపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

దీంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విడుదల చేసింది. గోదాముల నుంచి వెంటనే రేషన్‌ దుకాణాలకు బియ్యం తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 1 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పొందనున్నారు.