ఒకేసారి మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు గుడ్న్యూస్
ఒకేసారి మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు గుడ్న్యూస్
తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మార్గం సుగమమైంది.
మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేషన్ డీలర్లు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో బియ్యం సరఫరాపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
దీంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విడుదల చేసింది. గోదాముల నుంచి వెంటనే రేషన్ దుకాణాలకు బియ్యం తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టు 1 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పొందనున్నారు.