BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 11:06 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

48 ఏళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
20 Sep, 2026 - 11:06 AM
12 వీక్షణలు

మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

​ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోల పంపిణీ

​ధర్మపురి 

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలోని కాశెట్టి వాడ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాశెట్టి వాడ కుటుంబ సభ్యులు నిర్వహించిన 'తెలంగాణ జానపద ఆట–పాటల' సాంస్కృతిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. కాశెట్టి వాడ గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 48 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలతో పాటు నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి, వారిని కళారంగంలో ముందుకు నడిపించేందుకు మండలి సభ్యులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని తెలిపారు.

​అనంతరం సాంస్కృతిక పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మెమెంటోలను అందజేశారు.

​ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సంగి ఆనంద్, చుక్క సంధ్య, చిపిరిశెట్టి రాజేష్, కొమురెల్లి పవన్ కుమార్, కాశెట్టి వాడ గణేష్ మండలి సభ్యులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.