www.ntodaynews.com
పాఠశాలల్లో ఫీజుల పట్టిక ఏర్పాటు చేయాలి: పీడీఎస్యూ డిమాండ్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఫీజుల పట్టికను ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా ఆయన అదనపు కలెక్టర్ చంద్రయ్యకు ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించి, ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కొందరు వ్యాపారంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల దోపిడీని అరికట్టడానికి, విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.