www.ntodaynews.com
పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు: రూ. 5 లక్షల ఎల్ఓసీ అందజేత
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్కు చెందిన మహ్మద్ నజీర్ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 5,00,000/- (ఐదు లక్షల రూపాయల) ఎల్ఓసీ పత్రాన్ని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు గారు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సదరు కుటుంబ పరిస్థితిని తెలుసుకుని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించగా, అత్యంత క్లిష్ట సమయంలో తమకు కొండంత అండగా నిలిచిన ఎమ్మెల్యే గారికి మరియు వారి సతీమణి సురేఖ గారికి బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు