పేదల ఆకలి తీరుస్తున్న ‘దివాకరన్న పెరుగన్నం
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20వ రోజుకు చేరిన పంపిణీ
మంచిర్యాల: నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో చేపట్టిన ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి విజయవంతంగా 20వ రోజుకు చేరుకుంది. ఎండ తీవ్రత దృష్ట్యా నిరుపేదలు, బాటసారుల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 50వ డివిజన్ కార్పొరేటర్ పెట్టేం స్వరూప-లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు పాల్గొని ప్రజలకు పెరుగన్నాన్ని పంపిణీ చేశారు. వేసవిలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు గాదె సత్యం, నాయకులు ఖాజా, అఫ్జల్, సలాం, తాజీం, భీముడు, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, జక్కం జగన్ తదితరులు పాల్గొన్నారు