BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
24 Apr, 2026 - 03:53 PM
112 వీక్షణలు

పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు--బొమ్మలరామారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొలోగాని వెంకటేష్ గౌడ్

కాలేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ కు చట్టబద్ధత లేదని హైకోర్టు తీర్పునివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ అన్నారు మండల కేంద్రంలో శుక్రవారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిసీ ఘోష్  కమిషన్ ఇచ్చిన నివేదిక ముమ్మాటికి పిసిసి స్క్రిప్టు మాత్రమేనని దాంట్లో ఎలాంటి పసలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ పేరుతో వ్యక్తిగత కక్షలకు దిగుతున్నారని దీనికి ప్రజా కోర్టులో తప్పనిసరిగా తగుశిక్ష ఉంటుందని అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు 80 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగిపోతే దానికి ఏవేవో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధకులు యుగపురుషుడు లాంటి కేసీఆర్ ని ఏమి చేయలేరని అన్నారు సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వ మరో ఆలోచన కూడా విఫలం కాక తప్పదని బంగపాటు ఎదురవుతుందని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పై దృష్టి పెట్టాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కుక్కదువు ఉపేందర్ ముదిరాజ్, మైలారం నరసింహ, జిల్లా నాయకులు బోనంకూర మల్లేష్, కుక్కదువ్వు గణేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఉట్ల రమేష్, ఏల్లబోయిన సత్యనారాయణ, ఉట్ల స్వామి, యూత్ నాయకులు కోడిమాల వంశి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు