ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలోని ప్రభుత్వ భూములు, చెరువు గర్భం, కుంటల శిఖం భూముల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ బాధ్యతాయుత పౌరులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నీర్నేముల గ్రామంలో పబ్లిక్ భూములు, చెరువు శిఖం స్థలాలు రోజురోజుకూ అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో తహసీల్దార్ ) జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు (Endt.No.D/470/2026) ఉన్నప్పటికీ, అలాగే పత్రికల్లో విస్తృతంగా వార్తలు వచ్చినప్పటికీ నేటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఉమ్మడి సర్వే లేదా కబ్జాల తొలగింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు విచ్చలవిడిగా చెరువు శిఖం భూములను కబ్జా చేసి, పంటలు పండిస్తూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మరియు ఇరిగేషన అధికారులను ఆదేశించారు.
భావితరాల భవిష్యత్తు , పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ ఉమ్మడి పబ్లిక్ భూములు ఎంతో కీలకమని, అధికారులు వెంటనే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అక్రమ ఆక్రమణలను తొలగించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.