ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిరలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిరలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ఖమ్మం జిల్లా, మధిర, ఆగస్టు 6: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన విశిష్ట సేవలు, త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్. ఇందిర, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి డాక్టర్ పి. సుజాత, డాక్టర్ వి. నాగరాజు, డాక్టర్ ఎం.వి.ఎన్. శర్మ, సగ్గుర్తి జ్యోతి, ఎం. హారిక, పి. లక్ష్మీనారాయణ, పి. శ్రీనివాస్, టీ. ఆదర్శ్, ఎస్. పృథ్విరాజ్తో పాటు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.