ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ
మంచిర్యాలలో ఘనంగా 'బడిబాట' కార్యక్రమం
ఇంటింటికీ వెళ్లి 'బడిబాట' ప్రాముఖ్యతను వివరించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా వసతులను సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ ఆది శశికళ పిలుపునిచ్చారు.
గురువారం డివిజన్ పరిధిలో "మన ఊరు - మన బడి.. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు డివిజన్లోని ప్రతి ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని అన్నారు. చిన్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి, వారి ప్రాథమిక విద్యా పునాదిని బలోపేతం చేయాలని ఆమె తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యాశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు