BREAKING
చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ
www.ntodaynews.com

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
02 Aug, 2026 - 07:46 PM
24 వీక్షణలు

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల నియోజకవర్గం:

ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్యం చేరువ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు పేర్కొన్నారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, మౌలిక వసతులు, ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణాన్ని అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అంశాన్ని నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి అత్యాధునిక వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మంచిర్యాలలో నిర్మాణంలో ఉన్న ఈ నూతన ప్రభుత్వ ఆసుపత్రి పూర్తయితే నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు, అత్యవసర చికిత్స, ప్రత్యేక వైద్య విభాగాలు ఒకేచోట అందుబాటులోకి వచ్చి ఆరోగ్య రంగంలో కొత్త మైలురాయిగా నిలుస్తుంది" అని అన్నారు.

మంచిర్యాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం రాజీ పడకుండా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగానే కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.