www.ntodaynews.com
పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
తెలంగాణ
/
ములుగు
పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
ములుగు: ములుగు జిల్లా ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఇటీవల నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సెల్ఫీల కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని, అధికారులు సూచించే భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కోరారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించి, సురక్షితంగా పర్యటన పూర్తి చేసుకోవాలని పర్యాటకులకు సూచించారు.