పట్టణంలో కలకలం ఓ మైనర్ బాలికకు ప్రసవం చేయించి, పుట్టిన శిశువును విక్రయించారనే ఆరోపణ..
పట్టణంలో కలకలం ఓ మైనర్ బాలికకు ప్రసవం చేయించి, పుట్టిన శిశువును విక్రయించారనే ఆరోపణ..
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు తూర్పు మొగసాల ప్రాంతానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మ, గత నెల 5న కర్ణాటక రాష్ట్రం కు చెందిన మైనర్ బాలికకు స్థానిక స్కానింగ్ సెంటర్లో పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయించినట్లు సమాచారం.
ప్రసవం అనంతరం బాలిక మగ శిశువుకు జన్మనిచ్చిందని, అయితే తన బిడ్డను ఇవ్వాలని అడిగినప్పుడు అక్కడి నుంచి పంపించివేశారని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.
బెంగళూరుకు వెళ్లిన అనంతరం బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైద్యుల నివేదిక ఆధారంగా కుటుంబ సభ్యులు తిలక్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు సోమవారం ఆర్ఎంపీ డాక్టర్ ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం
ఈ ఘటనతో పుంగనూరులోని కొన్ని స్కానింగ్ సెంటర్ల కార్యకలాపాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.