పుంగనూరులో రాజకీయ పార్టీలతో డీఆర్వో సమీక్ష..
అన్నమయ్య జిల్లా
పుంగనూరు, పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో
డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం వివిధ రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ఇప్పటివరకు 69.82 శాతం ఎన్యూమరేషన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ 47.5 శాతం పూర్తయిందని వెల్లడించారు. జూలై 14వ తేదీ వరకు నమోదు గడువు ఉన్నందున, అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వినియోగించుకుని బీఎల్ వోల వద్ద నుంచి అవసరమైన దరఖాస్తు పత్రాలను తీసుకుని నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీకి చెందిన బీఎల్ ఏలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ బీఎల్ వోలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో పుంగనూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పణి కుమార్, (టీ.పీ. ఓ) జగదీష్తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.