BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:35 PM
144 వీక్షణలు

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ కలుపు మందు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా విస్సన్నపేట మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి, సుమారు 2250 లీటర్ల ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ స్టాకులపై “స్టాప్ సేల్” ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లలో అప్రమత్తత నెలకొంది.

అలాగే మండలంలోని పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అధికారులు, ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులు కూడా ఈ మందును కొనుగోలు చేయకుండా, వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రైతుల భద్రత, పంటల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.