BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:35 PM
99 వీక్షణలు

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ కలుపు మందు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా విస్సన్నపేట మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి, సుమారు 2250 లీటర్ల ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ స్టాకులపై “స్టాప్ సేల్” ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లలో అప్రమత్తత నెలకొంది.

అలాగే మండలంలోని పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అధికారులు, ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులు కూడా ఈ మందును కొనుగోలు చేయకుండా, వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రైతుల భద్రత, పంటల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.