BREAKING
చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం
www.ntodaynews.com

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 01:35 PM
23 వీక్షణలు

ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ కలుపు మందు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా విస్సన్నపేట మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి, సుమారు 2250 లీటర్ల ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ స్టాకులపై “స్టాప్ సేల్” ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లలో అప్రమత్తత నెలకొంది.

అలాగే మండలంలోని పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అధికారులు, ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులు కూడా ఈ మందును కొనుగోలు చేయకుండా, వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రైతుల భద్రత, పంటల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.