BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 09:49 PM
41 వీక్షణలు

ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయం

భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమే

న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా నగదు బదిలీలు, చెల్లింపులు చేసే భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు.

యూపీఐ వ్యవస్థ దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలక వేదికగా మారిన నేపథ్యంలో ఫోన్‌పే తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూపీఐ సేవలను రోజువారీ లావాదేవీల కోసం వినియోగిస్తున్నారు.

“భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయి. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదు” అని సమీర్ నిగమ్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో యూపీఐ వినియోగదారులపై భవిష్యత్తులో అదనపు ఆర్థిక భారం పడుతుందనే ఆందోళనలకు తెరపడినట్లయింది.