ఫోన్పే సీఈవో కీలక ప్రకటన
ఫోన్పే సీఈవో కీలక ప్రకటన యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయం
భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమే
న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా నగదు బదిలీలు, చెల్లింపులు చేసే భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపారు.
యూపీఐ వ్యవస్థ దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలక వేదికగా మారిన నేపథ్యంలో ఫోన్పే తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూపీఐ సేవలను రోజువారీ లావాదేవీల కోసం వినియోగిస్తున్నారు.
“భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయి. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదు” అని సమీర్ నిగమ్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో యూపీఐ వినియోగదారులపై భవిష్యత్తులో అదనపు ఆర్థిక భారం పడుతుందనే ఆందోళనలకు తెరపడినట్లయింది.