రాహుల్ గాంధీ ఛాంబర్లో ఇండియా కూటమి లోక్సభ నేతల భేటీ
రాహుల్ గాంధీ ఛాంబర్లో ఇండియా కూటమి లోక్సభ నేతల భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని రాహుల్ గాంధీ ఛాంబర్లో కాసేపట్లో ఇండియా కూటమి లోక్సభ పక్ష నేతల సమావేశం జరగనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతర రాజకీయ పరిణామాలు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం అంశాలను పార్లమెంట్లో బలంగా ప్రస్తావించాలని విపక్షం భావిస్తోంది. ఈ అంశంపై ఉభయసభల్లో ఉమ్మడి ఆందోళన చేపట్టే అవకాశాలపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదే అంశంపై కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చింది. సమావేశం అనంతరం ఇండియా కూటమి ఉమ్మడి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.