www.ntodaynews.com
రాజేంద్రనగర్: పోటెన్సీ టెస్ట్ నిలిపివేయాలి
తెలంగాణ
/
హైదరాబాద్
రాజేంద్రనగర్: పోటెన్సీ టెస్ట్ నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
రాజేంద్రనగర్ కోర్టు ఆదేశించిన పోటెన్సీ టెస్ట్ను నిలిపివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
తనపై పోటెన్సీ టెస్ట్ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్లో కోరారు. రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.