BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 06:59 PM
137 వీక్షణలు

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం: 5 కోట్లు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు

ఏలూరు/నూజివీడు, ఏప్రిల్ 11: రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం నూజివీడు మండలం యనమదల గ్రామంలో రూ.1.04 కోట్లు వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొత్తం రూ.5 కోట్లు వ్యయంతో గ్రామ అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, గత ప్రభుత్వ పాలనను తప్పు పట్టారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు పనిచేయాలని ప్రజలపై కట్టుబడి ఉన్నారని తెలిపారు.