BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 08:52 PM
94 వీక్షణలు

రైతులకు అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​గొల్లపల్లి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సందర్శన

​లారీ ప్రమాద బాధితులకు పరామర్శ

​కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

​గొల్లపల్లి, (ప్రజా లక్ష్యం ప్రతినిధి):

మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఇటీవల జరిగిన లారీ ప్రమాద ఘటనపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించారు. ప్రమాదంలో రైతులు గాయపడటంతో పాటు, మోటార్ సైకిళ్లు దెబ్బతిన్న విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు.

​ఈ సందర్భంగా మంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడి వారిని పరామర్శించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

​అధికారులకు కీలక ఆదేశాలు:

​కేంద్రం వద్ద మొక్కజొన్న నిల్వలు పెరగకుండా, రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

​వైద్య సహాయం: ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతుకు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

​భద్రతా చర్యలు: కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

​ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు