BREAKING
పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! సంగారెడ్డి: రూ.500 కోసం తండ్రి గొంతు కోసిన కొడుకు నోయెల్ టాటా త్వరలో ఆర్‌బిఐతో టాటా సన్స్ హోదా గురించి చర్చించవచ్చు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు
www.ntodaynews.com

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:28 PM
17 వీక్షణలు

దాదాపు మూడు దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడింది. రూ.20 లంచం ఆరోపణల కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఓ క్లర్క్, ప్యూన్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దిగువ కోర్టులు, గుజరాత్ హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

1996లో విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఏసీబీ నిర్వహించిన ట్రాప్‌లో ప్యూన్ వద్ద రూ.20 నగదు లభించగా, క్లర్క్ వద్ద ఆరోపించిన రూ.100 దొరకలేదు.

అయితే లంచం డిమాండ్ చేసినట్లు నిరూపించే బలమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలోనూ పలు వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించింది.

కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నారనే కారణంతోనే లంచం డిమాండ్, స్వీకరణ జరిగినట్లు నిర్ధారించలేమని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నేర నిర్ధారణకు అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది.

దీంతో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను కొట్టివేసి.. క్లర్క్, ప్యూన్ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 30 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ముగింపు లభించింది.