BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్‌మెన్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 02:49 PM
210 వీక్షణలు

రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్‌మెన్

యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్‌మెన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. మోటకొండూరు మండలంలోని మేడికుంటపల్లి గ్రామానికి చెందిన రైతు అనంతరెడ్డి తన వ్యవసాయ భూమి వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు కూడా చెల్లించాడు.

అయినా పని పూర్తి కాకపోవడంతో పలుమార్లు ఏఈ, అసిస్టెంట్ లైన్‌మెన్‌ను సంప్రదించాడు. పని పూర్తయ్యాక రూ.10 వేల వరకు ఇస్తానని చెప్పినా, అసిస్టెంట్ లైన్‌మెన్ రమేష్ మాత్రం లంచం ఇస్తేనే పని జరుగుతుందని పట్టుబట్టినట్లు సమాచారం.

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు అనంతరెడ్డి రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించారు.

ఈ క్రమంలో అనంతరెడ్డి ఇంటి వద్ద రమేష్ రూ.35 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లంచం అడిగే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు.