BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్‌మెన్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 02:49 PM
115 వీక్షణలు

రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్‌మెన్

యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్‌మెన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. మోటకొండూరు మండలంలోని మేడికుంటపల్లి గ్రామానికి చెందిన రైతు అనంతరెడ్డి తన వ్యవసాయ భూమి వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు కూడా చెల్లించాడు.

అయినా పని పూర్తి కాకపోవడంతో పలుమార్లు ఏఈ, అసిస్టెంట్ లైన్‌మెన్‌ను సంప్రదించాడు. పని పూర్తయ్యాక రూ.10 వేల వరకు ఇస్తానని చెప్పినా, అసిస్టెంట్ లైన్‌మెన్ రమేష్ మాత్రం లంచం ఇస్తేనే పని జరుగుతుందని పట్టుబట్టినట్లు సమాచారం.

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు అనంతరెడ్డి రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించారు.

ఈ క్రమంలో అనంతరెడ్డి ఇంటి వద్ద రమేష్ రూ.35 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లంచం అడిగే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు.