BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

రూ.84 ఆస్తులతోనే ఎన్నికల బరిలోకి 26 ఏళ్ల యువతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:40 AM
163 వీక్షణలు

రూ.84 ఆస్తులతోనే ఎన్నికల బరిలోకి 26 ఏళ్ల యువతి

కోట్ల ఖర్చు చేసే వారికే రాజకీయాల్లో అవకాశం ఉందనే అభిప్రాయాలను చెరిపేస్తూ ఆష్నా తంపి అనే యువతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కేరళలోని ఎట్టుమానూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేసింది ఎన్నికల అఫిడవిట్‌లో తన వద్ద కేవలం రూ.84 మాత్రమే ఆస్తి ఉందని పేర్కొంది అందులో చేతిలో రూ.40 నగదు బ్యాంక్ ఖాతాలో రూ.44 ఉన్నాయని తెలిపింది తన పేరుపై ఇల్లు స్థలం వాహనం వంటి ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేసింది కోట్లాది ఆస్తులు ప్రకటించే అభ్యర్థుల మధ్య ఆమె వెల్లడించిన ఈ నిరాడంబర వివరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి లిటరేచర్‌లో డిగ్రీ జర్నలిజంలో ఉన్నత డిప్లొమా పూర్తి చేసిన ఆమె ఆర్థికంగా వెనుకబడినప్పటికీ సామాజిక అవగాహనలో ముందుంది ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంది ఆశా వర్కర్ల హక్కుల కోసం పోరాటంలో భాగంగా తన జుట్టును కత్తిరించుకొని నిరసన తెలిపిన ఘటన ఆమె పట్టుదలను చాటింది ఎన్నికల ప్రచారంలో భారీ ఖర్చులకు దూరంగా ప్రజల నుంచి రూ.10 నుంచి రూ.50 వరకు చిన్న విరాళాలు సేకరిస్తూ ప్రచార పత్రాలు ముద్రించి స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తోంది కోటాయం వైద్య కళాశాలలో వైద్యుల కొరత వరి రైతుల సమస్యలు తాగునీటి ఇబ్బందులు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది రాజకీయాల్లో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమనే సందేశంతో ముందుకు సాగుతున్న ఈ యువతి సాధారణ ప్రజల ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది