BREAKING
పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు... పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.. రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి ​ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: కార్పొరేటర్ ఆది శశికళ పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ. ధాన్యపు డబ్బులు సకాలంలో చెల్లించాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బీఆర్ఎస్ నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్చార్జిల ప్రకటన: మంచిర్యాల బాధ్యతల్లో కౌశిక్ హరి వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్.. ప్రభుత్వాలకు కఠిన హెచ్చరిక మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా కుర్చీ తాత ఇకలేడు...
www.ntodaynews.com

రూ.84 ఆస్తులతోనే ఎన్నికల బరిలోకి 26 ఏళ్ల యువతి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 05:40 AM
180 వీక్షణలు

రూ.84 ఆస్తులతోనే ఎన్నికల బరిలోకి 26 ఏళ్ల యువతి

కోట్ల ఖర్చు చేసే వారికే రాజకీయాల్లో అవకాశం ఉందనే అభిప్రాయాలను చెరిపేస్తూ ఆష్నా తంపి అనే యువతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కేరళలోని ఎట్టుమానూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేసింది ఎన్నికల అఫిడవిట్‌లో తన వద్ద కేవలం రూ.84 మాత్రమే ఆస్తి ఉందని పేర్కొంది అందులో చేతిలో రూ.40 నగదు బ్యాంక్ ఖాతాలో రూ.44 ఉన్నాయని తెలిపింది తన పేరుపై ఇల్లు స్థలం వాహనం వంటి ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేసింది కోట్లాది ఆస్తులు ప్రకటించే అభ్యర్థుల మధ్య ఆమె వెల్లడించిన ఈ నిరాడంబర వివరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి లిటరేచర్‌లో డిగ్రీ జర్నలిజంలో ఉన్నత డిప్లొమా పూర్తి చేసిన ఆమె ఆర్థికంగా వెనుకబడినప్పటికీ సామాజిక అవగాహనలో ముందుంది ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంది ఆశా వర్కర్ల హక్కుల కోసం పోరాటంలో భాగంగా తన జుట్టును కత్తిరించుకొని నిరసన తెలిపిన ఘటన ఆమె పట్టుదలను చాటింది ఎన్నికల ప్రచారంలో భారీ ఖర్చులకు దూరంగా ప్రజల నుంచి రూ.10 నుంచి రూ.50 వరకు చిన్న విరాళాలు సేకరిస్తూ ప్రచార పత్రాలు ముద్రించి స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తోంది కోటాయం వైద్య కళాశాలలో వైద్యుల కొరత వరి రైతుల సమస్యలు తాగునీటి ఇబ్బందులు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది రాజకీయాల్లో డబ్బు కంటే ప్రజల సమస్యలే ముఖ్యమనే సందేశంతో ముందుకు సాగుతున్న ఈ యువతి సాధారణ ప్రజల ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది