BREAKING
డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు. అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.. గణనీయంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర హజరత్ సయ్యద్ నూర్ షావలి ఉరుసులో పాల్గొననున్న చల్లా ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు. అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.. గణనీయంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర హజరత్ సయ్యద్ నూర్ షావలి ఉరుసులో పాల్గొననున్న చల్లా ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
www.ntodaynews.com

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
09 May, 2026 - 11:28 AM
10 వీక్షణలు

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం

గోల్డెన్ అవర్‌లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ.

సహాయం చేసిన 'రహ-వీర్'లకు రూ.25,000 నగదు బహుమతి:జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.

 అనకాపల్లి రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం-రాహత్' (PM-RAHAT) పథకం ఒక గొప్ప వరమని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పేర్కొన్నారు.

గోల్డెన్ అవర్: ప్రాణాలకు సంజీవని

​ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైన సమయంగా ఎస్పీ అభివర్ణించారు. "ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 90% ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 నంబర్‌కు సమాచారం అందించాలి. అలాగే 108 అంబులెన్స్ ద్వారా బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలి" అని ఆయన సూచించారు.

'పీఎం-రాహత్' పథకం - సమగ్ర వివరాలు:

​ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా సరే (పాదచారులు, వాహనదారులు, లేదా విదేశీయులు) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత (Cashless) చికిత్స పొందే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన రోజు నుండి వరుసగా ఏడు రోజుల పాటు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందుతాయి. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా, రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం, పేద-ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యవసర సమయంలో ప్రాణరక్షణ కల్పిస్తుంది.

సహాయం చేసే వారికి 'రక్ష' - రూ.25,000 బహుమతి

​ప్రమాద బాధితులను కాపాడే ‘గుడ్ సమారిటన్ (రహ-వీర్)’లకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు.

నగదు పురస్కారం: బాధితులను సమయానికి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25,000/- నగదు బహుమతి అందజేస్తుంది.

వేధింపులు ఉండవు: సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయడం లేదా పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

త్వరితగతిన ధృవీకరణ: సమాచారం అందిన 24 గంటల్లోనే పోలీసు శాఖ ప్రమాద ధృవీకరణ పూర్తి చేసి, వైద్య ఆరోగ్య మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటుంది.

ఎస్పీ విజ్ఞప్తి: 

"మానవత్వంతో స్పందించండి.. ఒక ప్రాణాన్ని నిలబెట్టండి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు భయం వీడి సహాయం చేయండి. పీఎం-రాహత్ పథకం పట్ల ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలి.