www.ntodaynews.com
కోహెడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శెట్టి సుధాకర్ నియామకం
తెలంగాణ
కోహెడ | సిద్దిపేట జిల్లా | ntodaynews.com
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా వింజపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శెట్టి సుధాకర్ నియమితులయ్యారు.
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియామకాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు ఈ నియామకం జరిగినట్లు సమాచారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శెట్టి సుధాకర్ నియామకాన్ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శెట్టి సుధాకర్కు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కోహెడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శెట్టి సుధాకర్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తానని పేర్కొన్నారు.