BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పులి.. అప్రమత్తమైన అటవీ శాఖ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:23 PM
20 వీక్షణలు

ఏలూరు జిల్లా పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా అటవీ శాఖ పర్యవేక్షణలో ఉన్న పులి, తాజాగా నది దాటి పోలవరం జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి సిరివాక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు.

పులి కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కొరుటూరు ప్రాంతంలోనే బస చేస్తూ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బోన్లు, అవసరమైన పరికరాలు, వెటర్నరీ బృందాలను సిద్ధంగా ఉంచారు.

పులిని మత్తుమందు ఇచ్చి పట్టుకునే అవకాశాలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు. అయితే పులి సంచరిస్తున్న ప్రాంతంలో జనావాసాలు లేవని, ప్రస్తుతం అది పాపికొండలు జాతీయ ఉద్యానవనం పరిధిలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు, అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా, మండల స్థాయి యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. అలాగే గ్రామస్తులు నది పరివాహక ప్రాంతాల్లో చేపల వేట, పశువుల మేత కోసం వెళ్లవద్దని హెచ్చరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు పర్యాటక కార్యకలాపాలను మూడు రోజుల పాటు నియంత్రించాలని టూరిజం శాఖకు అటవీ శాఖ లేఖ పంపినట్లు వెల్లడించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.