BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పులి.. అప్రమత్తమైన అటవీ శాఖ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 12:23 PM
164 వీక్షణలు

ఏలూరు జిల్లా పరిధిలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా అటవీ శాఖ పర్యవేక్షణలో ఉన్న పులి, తాజాగా నది దాటి పోలవరం జిల్లా నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి సిరివాక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు.

పులి కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కొరుటూరు ప్రాంతంలోనే బస చేస్తూ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు నదీ తీర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బోన్లు, అవసరమైన పరికరాలు, వెటర్నరీ బృందాలను సిద్ధంగా ఉంచారు.

పులిని మత్తుమందు ఇచ్చి పట్టుకునే అవకాశాలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు. అయితే పులి సంచరిస్తున్న ప్రాంతంలో జనావాసాలు లేవని, ప్రస్తుతం అది పాపికొండలు జాతీయ ఉద్యానవనం పరిధిలోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు, అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా, మండల స్థాయి యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. అలాగే గ్రామస్తులు నది పరివాహక ప్రాంతాల్లో చేపల వేట, పశువుల మేత కోసం వెళ్లవద్దని హెచ్చరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు పర్యాటక కార్యకలాపాలను మూడు రోజుల పాటు నియంత్రించాలని టూరిజం శాఖకు అటవీ శాఖ లేఖ పంపినట్లు వెల్లడించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.