రుద్రవరంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభం
రుద్రవరంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభం
రెడ్డిగూడెం 19: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంఎన్ఆర్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రుద్రవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్. శ్రీను శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్. శ్రీను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శంకర కంటి ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, తదుపరి చికిత్స, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలపై వైద్య సూచనలు అందిస్తున్నారు.
ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలను పొందుతున్నారు.