BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
Date of Publish : 19 July 2026, 05:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రుద్రవరంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:20 PM
82 వీక్షణలు

రుద్రవరంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభం

రెడ్డిగూడెం 19: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంఎన్‌ఆర్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రుద్రవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌. శ్రీను శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్‌. శ్రీను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శంకర కంటి ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, తదుపరి చికిత్స, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలపై వైద్య సూచనలు అందిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలను పొందుతున్నారు.