BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

రుద్రవరంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:20 PM
28 వీక్షణలు

రుద్రవరంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభం

రెడ్డిగూడెం 19: గ్రామీణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంఎన్‌ఆర్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రుద్రవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య మహాశిబిరం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌. శ్రీను శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్‌. శ్రీను మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శంకర కంటి ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, తదుపరి చికిత్స, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలపై వైద్య సూచనలు అందిస్తున్నారు.

ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉచిత కంటి వైద్య సేవలను పొందుతున్నారు.