BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

​సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
08 Jun, 2026 - 06:11 PM
8 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.

​ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరల కారణంగా మార్కెట్‌లో ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని నిరసిస్తూ.. ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు