www.ntodaynews.com
సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరల కారణంగా మార్కెట్లో ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని నిరసిస్తూ.. ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు