సచివాలయం ముట్టడిలో బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నేతల నిరసన
హైదరాబాద్ | Ntoday News
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి ప్రయత్నం జరిగింది. ఈ నిరసనలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు బీజేవైఎం నేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనలో పాల్గొన్న రామచందర్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.