www.ntodaynews.com
సీడ్ మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి రేపు నూజివీడులో ధర్నా
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
సీడ్ మొక్కజొన్న రైతుల సమస్యల పరిష్కారానికి రేపు నూజివీడులో ధర్నా
సీడ్ మొక్కజొన్న విత్తన కంపెనీల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో జూలై 20 (సోమవారం) ఉదయం 10 గంటలకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రైతుసంఘం నాయకులు తెలిపారు.
ఈ సమస్యతో బాధపడుతున్న ప్రతి గ్రామంలోని రైతులకు సమాచారం అందించి, వారంతా సకాలంలో నూజివీడుకు చేరుకుని ధర్నాలో పాల్గొని తమ సమస్యల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని రైతుసంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం రైతుసంఘం నాయకులు రాయంకుల లక్ష్మణరావు, మడుపల్లి వెంకట నాగేంద్రరావును సంప్రదించాలని సూచించారు.