BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జలాభిషేకం గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో పర్మిషన్..... ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ......
Date of Publish : 19 July 2026, 05:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సెప్టెంబర్ నుంచి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కసరత్తు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:25 PM
80 వీక్షణలు

సెప్టెంబర్ నుంచి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కసరత్తు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నాయకత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు.

అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ, ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం, ప్రతిపక్ష ప్రచారానికి సమాధానం ఇవ్వడం వంటి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రారంభించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.