BREAKING
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
www.ntodaynews.com

శ్రావణ శుక్రవారం సందర్భంగా గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 08:07 PM
54 వీక్షణలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా గంపలగూడెం మండలంలో పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని పలు దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం సందర్భంగా స్వామివారికి ఫలాలంకరణ, అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ ఆకట్టుకుంది. ఆలయ అర్చకులు టీ. గోపాలచార్యులు ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ ఎన్. సంధ్య, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

గంపలగూడెం మండలం పెనుగొలను మెట్ట గుట్టపై ఉన్న శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు యోగానందాచార్యులు భక్తులచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పంది వెంకట్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెనుగొలను శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు దాములూరు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో లలితా దేవి పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.