శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం
హాజీపూర్ మండలం గడ్డపూర్ శివారులోని ఎసీసీ క్వారీ శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు
హాజీపూర్ మండలం గడ్డపూర్ శివారులోని ఎసీసీ క్వారీ వద్ద నిర్వహించిన శ్రీ దుర్గాదేవి జాతర మహోత్సవంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కలిసి జాతర ఉత్సవాలను వీక్షించి నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, వొడ్డె రాజమౌళి, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, భక్తులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.