టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన రేపల్లె టీడీపీ నేత గుడిపాటి శ్రీనివాసరావు
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన రేపల్లె టీడీపీ నేత గుడిపాటి శ్రీనివాసరావు
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత గుడిపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా గుడిపాటి శ్రీనివాసరావు, ఆయన అనుచరులను వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. రేపల్లె నియోజకవర్గంలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో గుడిపాటి శ్రీనివాసరావు చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.