www.ntodaynews.com
పుంగనూరులో తెలుగు తమ్ముళ్ల సంబరాలు
తెలంగాణ
పుంగనూరులో తెలుగు తమ్ముళ్ల సంబరాలు
NTOADAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు మదనపల్లి జిల్లా ఏర్పాటుతో పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీగా బాణాసంచా పేల్చి, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని పేర్కొన్నారు. మదనపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాటిలేరని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో మదనపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించడం ఖాయమని పేర్కొన్నారు.ఈ సంబరాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి.వి. రెడ్డి, మాధవ రెడ్డి, సుకుమార్ బాబు, దినేష్, రామకృష్ణంరాజు, శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ శమిపతి, మైనారిటీ నాయకులు షామీర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube